ఏపీలో ఉద్యోగాల జాతర, నోటిఫికేషన్ల జారీ

Friday, May 26, 2023 11:37 PM News
ఏపీలో ఉద్యోగాల జాతర, నోటిఫికేషన్ల జారీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిరుద్యోగులకు తీపి కబురు వినిపించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న వందలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రెవెన్యూ, రవాణా, వాణిజ్యం, అటవీ, మున్సిపాలిటీలు, దేవాదాయం, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, ఎక్సైజ్, ఆర్థికం, వంటి శాఖల్లో ఉన్న వేర్వేరు హోదాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఖాళీలు ఉన్నాయి. సుమారుగా వెయ్యి వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి.

దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. గ్రూప్ స్థాయి అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.

For All Tech Queries Please Click Here..!