ఏపీలో మరో 15 పాజిటివ్: కొత్త కేసులన్నీ మూడు జిల్లాల్లోనే.

Wednesday, April 8, 2020 11:17 AM News
ఏపీలో మరో 15 పాజిటివ్: కొత్త కేసులన్నీ మూడు జిల్లాల్లోనే.

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మరోసారి పెరిగింది. కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలోని వేర్వేరు కరోనా వైరస్ ల్యాబొరేటరీల్లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఆయా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 329కి చేరింది. 

కొత్తగా పాజిటివ్ వచ్చిన ఈ 15 కేసులన్నీ మూడు జిల్లాల్లోనే నమోదు అయ్యాయి. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆరు చొప్పున, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి. వైరస్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించగా. ఆరుమంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వారికి ట్రావెల్ హిస్టరీ ఉందా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నామని నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. జిల్లాలవారీగా అనంతపురం-6, చిత్తూరు-20, తూర్పు గోదావరి-11, గుంటూరు-41, కడప-28, కృష్ణా-35, కర్నూలు-74, నెల్లూరు-49, ప్రకాశం-24, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-21 కేసులు నమోదయ్యాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: