ఏపీలో ఉన్నారా? వచ్చే రెండ్రోజులు జాగ్రత్త..!
Sunday, February 9, 2025 06:58 AM Weather

ఏపీలో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు పేర్కొంది.
కృష్ణా జిల్లా నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది. వివిధ ప్రాంతాలలోనూ అదే మాదిరి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరో రెండ్రోజులు ఎండ వేడికి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: