Breaking: భారత్ ఘన విజయం
Sunday, March 16, 2025 11:11 PM Sports

మాస్టర్స్ లీగ్ T20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. రాయ్పూర్ లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టును ఇండియా మాస్టర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు 148 పరుగులు చేసింది.
149 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.1 ఓవర్లలోనే చేధించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసి అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ 25 పరుగులతో మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: