T20 : ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఘన విజయం
Wednesday, January 22, 2025 11:32 PM Sports

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 133 పరుగులు చేసి అలౌటైంది. ఈ లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సంజు శాంసన్ 20 బంతుల్లో 26, తిలక్ వర్మ 16 బంతుల్లో 19 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 68 చేశాడు. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసీ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఈ నెల 25న చెన్నై వేదికగా జరగనుంది
.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: