నాపై కేసులు కొట్టేయండి: హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
Friday, February 21, 2025 01:07 PM Politics

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఎలాంటి కారణాలు లేకుండా తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించడంపై ఈ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: