ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నామినేషన్
Thursday, August 21, 2025 02:42 PM Politics
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
నామినేషన్ ను బలపరుస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు. అయితే ఇప్పటికే ఎన్డీయే కూటమి నుండి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుదర్శన్ రెడ్డిది తెలంగాణ కావడం విశేషం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
