కేసీఆర్ కీలక నిర్ణయం

Monday, June 2, 2025 03:45 PM Politics
కేసీఆర్ కీలక నిర్ణయం

ఈనెల 5న కాళేశ్వరం విచారణకు హాజరు కావద్దని మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసిఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఈ నెల ఐదు నుంచి 11కు కమిషన్ అధికారులు మార్చారు. దీంతో జూన్ 11న పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ ఎదుట హాజరు కానున్నారు.

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఆయనకు ఈ నోటీసులు ఇచ్చింది. జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్రరావు, ఈటల రాజేందరు కమిషన్ నుంచి నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అవకతవకలపై విచారణ జరుపుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. గతేడాది మార్చి 13న రేవంత్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన ఇప్పటికి 14 నెలలు పూర్తి కావచ్చింది. ఏడుసార్లు కమిషన్ గడువు పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటివరకు 109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డు చేసింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: