వివేక హత్య కేసు: అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి
Sunday, March 16, 2025 10:38 PM News
_(19)-1742144863.jpeg)
మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి భార్యపై దాడి జరిగింది. కడప జిల్లా తొండూరు మండలం మల్లేలలో తనపై దాడి జరిగినట్లు దస్తగిరి భార్య షబానా ఓ వీడియో విడుదల చేశారు. శంషున్, పర్వీన్ అనే ఇద్దరు మహిళలు తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ఏడాదిలోపు తన భర్తను నరికేస్తామని బెదిరించినట్లు చెప్పారు. నిన్న సాయంత్రం ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ పై దస్తగిరి అబద్ధపు సాక్షం చెప్పారని ఆ మహిళలు తనతో అన్నట్లు షబానా తెలిపారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: