Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Monday, June 30, 2025 08:08 AM News
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కురబల కోట మండలం చెన్నా మరిమిట్ట గ్రామం వద్ద టెంపోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా 11మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



