ట్రంప్ కు షాకిచ్చిన కోర్టు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిగిలింది. ఇటీవల ట్రంప్ సర్కార్ హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే తాజాగా ఆ ఉత్తర్వులను అక్కడి ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. దీన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా కోర్టు అభివర్ణించింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం 500 నుంచి 800 మంది భారతీయ విద్యార్థులు, స్కాలర్లు ఈ విశ్వవిద్యాలయంలో భాగమవుతారు. ప్రస్తుతం, 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్లో చదువుతున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 6,800 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వారి విద్యా జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే వారు ఇప్పుడు తమ తదుపరి దశల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించడానికి నిరాకరించినట్లు తెలిపింది. ఈ చర్యను చట్టవిరుద్ధమని, తమ పరిశోధనా లక్ష్యాలను దెబ్బతీస్తుందని హార్వర్డ్ వెల్లడించింది. ఈ వివాదం హార్వర్డ్కు మాత్రమే కాకుండా, అమెరికాలోని ఉన్నత విద్యా వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఒక లేఖలో, హార్వర్డ్ యూనివర్సిటీ "యూదు విద్యార్థులకు వ్యతిరేకమైన అసురక్షిత క్యాంపస్ వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. ప్రో-హమాస్ సానుభూతిని ప్రోత్సహిస్తోందని, జాతివివక్షతో కూడిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (DEI) విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.