పాక్ కాల్పులు.. తెలుగు జవాన్ వీర మరణం

Friday, May 9, 2025 02:37 PM News
పాక్ కాల్పులు.. తెలుగు జవాన్ వీర మరణం

భారత్, పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతున్నాయి. భారత సైన్యం దీటుగా ఏంతిప్పికొడుతోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతి చెందిన జవాన్‌ను మురళీనాయక్‌గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం.

మురళీ నాయక్ తల్లిదండ్రులకు (జ్యోతిరాయి-శ్రీరాముల నాయక్) ఏకైక సంతానం. ఇక సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌ విద్యా వ్యాసం చేసిన వీర జవాన్.. 2022లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు. నాసిక్‌లో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్‌లో పనిచేస్తుండగా.. భారత్-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందాడు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: