డ్యూటీలో ఉన్న ఏడుగురు పోలీసులు అదృశ్యం
Monday, July 21, 2025 06:15 PM News
పాకిస్తాన్ లో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. పాక్ లోని వాయువ్య ఖైబర్ పఖుతుంఖాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని సౌత్ వాజిరిస్తాన్ జిల్లాలో రెండు వేరువేరు చోట్ల ఏడుగురు పోలీసులు అదృశ్యమైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్లు తెలిపారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)