రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
Sunday, March 23, 2025 10:08 PM News
_(6)-1742747867.jpeg)
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ ఏప్రిల్ నుంచి 6కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఈ నెల 30న హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
దొడ్డు(లావు) బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: