RCB విజయోత్సవ ర్యాలీ: తొక్కిసలాటలో 11 మంది మృతి

Wednesday, June 4, 2025 09:24 PM News
RCB విజయోత్సవ ర్యాలీ: తొక్కిసలాటలో 11 మంది మృతి

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు.

అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చిన్నస్వామి స్టేడియంవైపు వెళ్లే మెట్రో, ఇతర వాహనాలను ఆపేసారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: