BREAKING: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
Monday, May 12, 2025 04:57 PM News

ప్రధాని మోడీ ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడనున్నారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉండగా.. భారత్-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా భారత్ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, మసూద్ అజార్,హఫీజ్, దావూద్ ఇబ్రహీంను భారత్కు అప్పగించాలి. అలాగే POKను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత్ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: