కుంభమేళా తొక్కిసలాటపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Wednesday, January 29, 2025 02:19 PM News

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది వరకూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: