అంబటి రాంబాబుకు నోటీసులు
Sunday, July 20, 2025 04:26 PM News
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈ నెల 21న స్టేషన్లో హాజరుకావాలని తాజాగా ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
గతంలో సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, తాజాగా రూరల్ పోలీస్ స్టేషన్ లోనూ అంబటిపై మరో కేసు నమోదైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)