మటన్ తిని ఒకరు మృతి.. ఏడుగురికి అస్వస్థత
Wednesday, July 23, 2025 11:16 AM News
హైదరాబాద్: వనస్థలిపురం చింతలకుంట ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ యాదవ్ (46) ఆదివారం బోనాల పండగ సందర్భంగా ఇంటికి మటన్ బోటి, చికెన్ తీసుకొచ్చారు. ఆ రాత్రి వండుకుని కుటుంబ సభ్యులు తిన్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టారు. సోమవారం ఆ మాంసాన్ని వేడి చేసి మళ్లీ తిన్నారు.
దీంతో కుటుంబ సభ్యులందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో శ్రీనివాస్ మృతి చెందాడు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)