తొక్కిసలాటపై స్పందించిన ప్రభుత్వం
Sunday, June 29, 2025 09:24 PM News
జగన్నాథుడి రథ యాత్ర సందర్భంగా పూరీలోని ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి, పలువురు గాయపడడంపై ఒడిశా ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై ప్రజలకు సీఎం మోహన్ చరణ్ మాంఝి క్షమాపణలు చెప్పారు. ఈ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



