తొక్కిసలాట ఘటన: గాయపడిన వారికి నోటీసులు
Monday, June 9, 2025 04:00 PM News

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెంది, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయపడిన 45 మందికి బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య బెంగళూరులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న మెజిస్టీరియల్ కోర్టు ఆడిటోరియానికి వచ్చి తమ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: