మిథున్ రెడ్డికి జైలులో ప్రత్యేక సౌకర్యాలు
Tuesday, July 22, 2025 10:10 PM News
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది. జైలులో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్-పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టీవీ అనుమతించాలని కోర్టు పేర్కొంది. పేపర్, వాటర్ బాటిల్స్, ఆహారం ఖర్చును మిథున్ రెడ్డి భరించాలని కోర్టు స్పష్టం చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



