ఆపరేషన్ సింధూర్: కీలక ఉగ్రనేతలు హతం
Wednesday, May 7, 2025 02:46 PM News

పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై ప్రతీకారదాడులను జరిపింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని భారతసైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన 10మంది సభ్యులు భారత్ దాడుల్లో చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానని మసూద్ లేఖను విడుదల చేశాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: