ప్రణయ్ హత్య కేసు: తీర్పు తర్వాత నిందితులు జడ్జితో చెప్పిన చివరి మాటలు ఇవే

మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. ప్రణయ్ హత్య కేసులో ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏ1 అమృతరావు ఇప్పటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తీర్పు ప్రకటించిన తర్వాత ఏమైనా చెప్పుకుంటారా అని దోషులకు న్యాయమూర్తి అడిగారు. ఏ3 అజ్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 నజీమ్ ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.
ఏయే దోషి ఏమన్నాడు?
A2 : శిక్ష గురించి నేనూ చెప్పుకునేది ఏమిలేదు. నా పాత్ర లేదు. మా నాన్న చనిపోయారు. మేము బ్రాహ్మణులం. కర్మకాండలు నిర్వహించాలి. మా అమ్మను చూసుకోవాలి.
A3: శిక్ష తగ్గించి వేయండి. నేను ఏ తప్పూ చేయలేదు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పాపకు ఆరోగ్యం సరిగా లేదు.
A4: నేను హర్టు పేషెంట్ని. భార్య ఉంది. ఆమెకు ఇక తోడు ఎవ్వరు లేరు. ఆమెకు తోడుగా నేను ఉండాలి.
A5: నాకు గుండె సమస్య ఉంది. నా భార్యకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. చదువుతున్న చిన్న పిల్లలు ఉన్నారు.
A6: నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నా కొడుకు నీరుద్యోగి. ఈ కేసులో నా ప్రమేయం లేదు. దేశము అంతా తెలుసు.
A7 : నాకు చిన్న పిల్లలు ఉన్నారు.