దండలు అమ్మిన తేనెకళ్ల సుందరికి సినిమా ఆఫర్

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఓ అమ్మాయి ఫోటోతలు, వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాటుక పెట్టిన తేనె కళ్లు.. సామనలుపు చర్మం సౌందర్యం.. పెదవి విరపగానే కనిపించే అందమైన చిరునవ్వు.. చూసిన వెంటనే మనసు కట్టిపడేసే అందంతో మహాకుంభమేళాకు వచ్చిన ప్రజలను మంత్రముగ్దులను చేసింది. దీంతో ఆ అమ్మాయి రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఒక్క సోషల్ మీడియానే కాదు.. చోటా మోటా ఛానళ్ల నుండి.. బడా ఛానళ్ల వరకూ అందరూ కెమెరా మైక్ పట్టుకుని ఆమె ఎక్కడుంటే అక్కడ వాలిపోతోంది.
ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కేవలం సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ షోల నుండి సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగిపోయారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే నెట్టింట రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్లు.. సామనలుపు చర్మం సౌందర్యం.. పెదవి విరపగానే కనిపించే అందమైన చిరునవ్వు.. చూసిన వెంటనే మనసు కట్టిపడేసే అందంతో సాధారణ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముకుంటూ కనిపించిన ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిపోయిన కొందరు.. వెంటనే ఆమె ఫోటోలు నెట్టింట్లో షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది.
ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరానికి చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్లు.. చూడచక్కని రూపం.. మాట్లాడే విధానం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడైతే మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోనాలీసాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మోనాలిసా.. చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్.
బాలీవుడ్ డైరక్టర్ సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా రూపం.. ఆమె అమాయకత్వాన్ని చూసి తాను చాలా ఫిదా అయ్యాయనని.. మోనాలీసాకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం సరిగ్గా ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని.. ఇందులో ఒక రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని.. త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.