నూతన రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
Monday, May 12, 2025 08:05 AM News
ఏపిలో నూతన రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న వారికి సైతం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఇస్తామని పేర్కొన్నారు. ఐతే చిన్న పిల్లలు, 80 దాటిన వృద్ధులు మినహా రేషన్ కార్డులు పేరున్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 95 శాతం కేవైసీ పూర్తి చేసి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



