ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఎత్తివేత

Wednesday, January 8, 2025 02:35 PM News
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవు, కేవలం సెకండ్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.

ఇంటర్ తొలి సంవత్సరానికి పరీక్షలు రద్దు చేసిన నిర్ణయంపై ఈ నెల 26 వరకూ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే 2025-2026 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో NCERT సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: