తొక్కిసలాట ఘటన: ఎక్స్రేషియా ప్రకటించిన ప్రభుత్వాలు
Thursday, June 5, 2025 06:57 AM News
_(3)-1749086837.jpeg)
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారికి కేంద్రం రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మరో వైపు మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.10లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మృతుల్లో ఎక్కువగా యువత ఉన్నారని, స్టేడియం సామర్థ్యం 35వేలు అయితే 2లక్షల మంది వరకు వచ్చారని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: