ఉత్తర కాశీలో జల ప్రళయం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ
Tuesday, August 5, 2025 07:42 PM News
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. పర్వత సానువుల్లో ఉన్న ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో ఊరంతా అతలాకుతలమైంది. హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి. ఘటన తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది.
150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక 'ఎక్స్'లో పేర్కొంది. హర్షిల్లోని ఆర్మీ క్యాంప్ కు దాదాపు 4 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)