తహసీల్దార్ కార్యాలయంలోనే రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
Friday, August 22, 2025 04:19 PM News
తహశీల్దార్ కార్యాలయంలోనే రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సత్యసాయి జిల్లా నల్లమాడలో చోటు చేసుకుంది. నల్లమాడ మండలం వేళ్లమద్దికి చెందిన రైతు కె.గంగప్ప దంపతులు భూసమస్యతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
స్థానికులు అడ్డుకుని ప్రాణాలను రక్షించారు. సర్వే నం.283లో రోడ్డు వేయడం, తన భూమి చివరన వేసుకోవాలని కోరినా వినిపించకపోవడంతో వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)