ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారని.. సిగ్నల్ కు కరెంట్ కట్
Friday, February 21, 2025 06:00 PM News
_(24)-1740129742.jpeg)
ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారని ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ కు కరెంట్ కట్ చేశారు. మెదక్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్పై ముగ్గురు విద్యుత్ సిబ్బంది వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
'మేం ట్రాన్స్కో సిబ్బంది. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం' అని బెదిరించి వారు వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే 2 రోజులు ట్రాఫిక్ సిగ్నల్ కు కరెంట్ కట్ చేశారు. సీఐ వెళ్లి ట్రాన్స్కో అధికారులతో చర్చించడంతో సరఫరాను పునరుద్ధరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: