మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
Sunday, August 3, 2025 09:09 AM News
ఏపిలో ఈ నెల 15 నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చంద్రబాబు మరో సారి స్పష్టం చేశారు. శనివారం ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో ఆయన మాట్లాడుతూ.. "స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీంతో దాదాపు 2.62 కోట్ల మంది మహిళలు లబ్ది పొందుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాలో వేశాం. ఎన్ని కష్టాలున్నా అవి నా వరకే పరిమితం" అని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



