గొంతు కోసి చెత్తకుండీలో పడేసినా.. చావును గెలిచిన పసికందు
Sunday, February 16, 2025 10:09 PM News

గొంతు కోసి చెత్తకుండీలో పడేసినా ఆ పసికందు చావును గెలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్లో చోటుచేసుకుంది. ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది.
దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లిని, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: