ధర్మస్థల కేసులో మరో బిగ్ ట్విస్ట్
Saturday, August 9, 2025 07:29 PM News
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు ప్రారంభించాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది.
కొండ సమీపంలోనే శవాలను పూడ్చినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సిట్ కు సమాచారం ఇవ్వడంతో కొండ చుట్టూ మార్కింగ్ చేసిన ప్రతీ చోట తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడనుందని సిట్ భావిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



