భారత్ ప్రాజెక్టు కోసం అమెరికా కంపెనీ ఆసక్తి
Monday, June 9, 2025 05:00 PM News

భారత్ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లను తయారు చేసేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ CEO లారీ కల్ప్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పాటు ఆమ్కా(అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్)కు ఇంజిన్లను అందించే కాంట్రాక్ట్ కోసం పోటీ పడతామని పేర్కొన్నారు. పౌర, మిలిటరీ వైమానిక రంగ కార్యకలాపాల్లో భారత్ ను ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: