ఓజీ నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్
Saturday, August 23, 2025 10:19 PM Entertainment
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఓజీ' ఒకటి. అయితే 'ఓజీ' థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, దిల్ రాజు, మైత్రీ మేకర్స్ నైజం హక్కుల కోసం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.
నైజాం హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే నిజాం ఏరియాలో ఇది రికార్డు స్థాయి ధర అవుతుంది. అయితే ట్రేడ్ నిపుణుల ప్రకారం నైజాం హక్కులు 60 నుంచి 63 కోట్ల మధ్య క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)