యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి
Wednesday, April 2, 2025 01:00 PM Crime
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో ఆ యువతి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మంటలు అంటుకోవడంతో అతని వీపు కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



