ధర్మవరం వాసిపై దేశద్రోహం కేసు
Sunday, August 17, 2025 11:22 AM Crime
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై స్థానిక 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదైంది. ఉగ్రవాద కార్య కలాపాలకు పాల్పడుతున్నాడని ఈ రోజు ఉదయం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 ఉగ్రసంస్థలతో మహమ్మద్ కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. అటు ధర్మవరం 1-టౌన్ PS పరిధిలోని ఎర్రగుంట్ల వాసి రియాజ్ ‘No India I love Pakistan' అని వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
