సీమంతం జరిగిన 10 రోజులకే గర్భిణి మృతి
Sunday, May 25, 2025 12:30 PM Crime

సీమంతం జరిగిన 10 రోజులకే గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. బిచ్కుందకు చెందిన మంగలి సునీల్ కు గతేడాది మద్నూర్ మండలం పెద్దతడూర్ గ్రామానికి చెందిన జ్యోతి(27)తో వివాహమైంది. ఆమె ఐదు నెలల గర్భిణి కాగా ఈ నెల 14న బిచ్కుందలో సీమంతం నిర్వహించారు.
అయితే భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వస్తుండగా బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం నుండి జ్యోతి జారి కిందపడ్డారు. తలకు గాయాలయ్యాయి. అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: