Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
Thursday, June 5, 2025 08:51 AM Crime
_(24)-1749093680.jpeg)
నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట అడ్డరోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొనడంతో నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులను వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న పొగాకు కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: