చదువు పేరుతో సహజీవనం.. చివరికి మరణానికి..

Wednesday, June 11, 2025 02:59 PM Crime
చదువు పేరుతో సహజీవనం.. చివరికి మరణానికి..

సహజీవనం చేస్తూ వచ్చిన ఓ జంట మధ్య వివాదం చివరికి మరణానికి దారి తీసింది. విల్లుపురం అన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఆకాశ్, అభినయ చెన్నై ఐసీఎఫ్ సమీపంలోని రాజీవ్ందీ నగర్లో కొంత కాలంగా చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. తామిద్దరం భార్యభర్తగా వీరు పరిసర వాసులకు చెప్పుకుంటూ వచ్చారు.  

అభినయ ఇంగ్లిష్ లిటరేచర్లో బీఏ, ఆకాష్ బీఎస్సీ చదువుతున్నారు. కళాశాలలో ప్రేమించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ఒక ప్రాజెక్టు వర్క్ పేరిట చెన్నైకు వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు. ఐసీఎఫ్ ఆవరణలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాభర్తలా సహజీవనం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఇంటికి, కళాశాలకు వెళుతూ వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. గత పది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండడం ఇరుగు పొరుగు గమనించారు. అయితే గొడవ ఎందుకు జరిగింది అనే కారణాలు బయటకు రాలేదు. సోమవారం కూడా వీరు గొడవపడినట్టు తెలిసింది. ఆవేశంలో అభినయను కొట్టి చంపేసి, ఆ తర్వాత భయంతో ఆకాశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఆకాశ్, అభినయ బంధువులు, కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. ఇరు తరఫు బంధువులను, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు చదువుల్లో రాణిస్తూ ఉండడంతోనే ప్రాజెక్టు కోసం చెన్నైకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ జంట సహజీవనం పేరిట ముందుకు సాగి చివరకు వివాదాలతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: