కూతురికి కన్యాదానం చేసి.. మండపంలోనే..
Saturday, February 22, 2025 10:00 AM Crime

పెళ్లి మండపంలోనే వధువు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. జిల్లాలోని బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన బాలచంద్రం (56) తన కుమార్తెకు వివాహం జరిపిస్తున్నారు.
ఈ క్రమంలో అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం పూర్తి చేసి మండపంలోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించి వైద్యులు పరీక్షించేలోపే ఆయన మృతి చెందారు. ఇదే జిల్లాలో శుక్రవారం పదో తరగతి అమ్మాయి కూడా గుండెపోటుతో మృతి చెందింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: