ఘోర రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్ల రాకపోకలు
Tuesday, February 4, 2025 12:47 PM Crime
ఉత్తర ప్రదేశ్ లో మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఫతేపూర్లోని పంభీపూర్ సమీపంలో సిగ్నల్ లేకపోవడంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది.
గార్డ్ కోచ్, ఇంజిన్ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు రైల్వే అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
