విరాట్ కోహ్లి అరుదైన ఘనత
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించారు. IPL టోర్నీలో అత్యధిక సార్లు 500కుపైగా రన్స్ సాధించిన ప్లేయర్ గా విరాట్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 8 సార్లు 500కుపైగా పరుగులు నమోదు చేశారు. CSK తో జరిగిన మ్యాచులో ఛేజ్ మాస్టర్ ఈ ఫీట్ నెలకొల్పారు. మరోవైపు ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గానూ కోహ్లి (CSKపై 1,146) రికార్డు సృష్టించారు.