Breaking: భారత్ ఘన విజయం
మాస్టర్స్ లీగ్ T20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. రాయ్పూర్ లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టును ఇండియా మాస్టర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు 148 పరుగులు చేసింది.
149 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.1 ఓవర్లలోనే చేధించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసి అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ 25 పరుగులతో మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.