పాకిస్థాన్ పై భారత్ విజయం
ఉజ్బెకిస్థాన్ లో జరుగుతున్న సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (CAVA) నేషన్స్ లీగ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచింది. 25-19, 25-19, 25-23 తేడాతో పాక్ ను ఓడించింది. ఈ లీగ్ లో ఇప్పటివరకు 7 మ్యాచులాడిన భారత్ 3 విజయాలు సాధించింది. 3 మ్యాచులు డ్రా కాగా, ఒక దాంట్లో ఓడింది. తొలుత ఈ లీగ్ ను పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది. ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో ఉజ్బెకిస్థాన్ కు మార్చారు.