ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం...!
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని లేటెస్ట్ టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే–2019లో తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఘన విజయం సాదించబోతుంది అని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం 3 స్థానాలకు పరిమితం కానుంది అని పేర్కొంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని స్పష్టం చేసింది . అలాగే గతంతో పోల్చుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరగనున్నట్లు టైమ్స్నౌ– వీఎంఆర్ సర్వేలో వెల్లడయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 45.5 శాతం ఓట్లు వచ్చాయి, ఈసారి ఏకంగా 48.8 శాతం ఓట్లను దక్కించుకోనుందని సర్వే తెలిపింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 40.5 శాతంగా ఉన్న టీడీపీ ఓటింగ్ శాతం ఈసారి 38.4 శాతానికి పడిపోనుందని సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ 2.2 శాతం, బీజేపీ 5.8 శాతం, ఇతరులు 4.9 శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది.