రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్
పాకిస్థాన్ ఉగ్రవాదులను ఏరిపారేసిన 'ఆపరేషన్ సింధూర్' తరహాలో రాష్ట్రంలో 'ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్' చేపట్టి, ఆర్థిక ఉగ్రవాదులను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో, రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక నేరగాళ్లు సమాజానికి అంతకంటే ఎక్కువ హానికరమని ఆయన అన్నారు. కడప శివార్లలో గురువారం జరిగిన మహానాడు మూడో రోజు బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.