ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. తిరుపతిలో ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో పలువురు యువకులు డ్రగ్స్ తీసుకుంటుండగా వీడియో తీశారు. స్వయంగా మత్తు ఇంజక్షన్లు యువత వేసుకుంటున్నారు. కొంతమంది యువకులు నేరుగా వీధుల్లోనే ఇంజక్షన్లు వేస్తూ కనిపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.