వల్లభనేని వంశీకి మళ్ళీ షాక్..
నకిలీ పట్టాలు పంపిణీ చేశారానే ఆరోపణలతో వల్లభనేని వంశీపై ఏలూరు జిల్లా బాపూలపాడు మండలంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆయనను హాజరు పరిచారు. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు తన అనుచరుడు రంగాకు కూడా 14 రోజుల రిమాండ్ ను విధించింది